Nandini Reddy Bollywood 2027 త్వరలో హిందీ సినిమా, డార్క్ వెబ్సిరీస్తో కొత్త ప్రయాణం
Nandini Reddy Bollywood 2027 నందినీ రెడ్డికి హిందీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు
టాలీవుడ్లో తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలు, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకురాలు నందినీ రెడ్డి ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులు వేయడానికి సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ మంచి స్పందనతో పాటు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకునే వసూళ్లు సాధించింది. ఈ విజయంతో నందినీ రెడ్డికి హిందీ చిత్ర పరిశ్రమ నుంచి కూడా అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.
ఈ సందర్భంగా నందినీ రెడ్డి మాట్లాడుతూ.. తాను రెండేళ్ల పాటు ఢిల్లీలో చదువుకున్నానని, ఆ సమయంలో అనేక హిందీ సినిమాలు చూసినట్లు తెలిపారు. మంచి కథ దొరికితే హిందీలో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కథకు భాష అడ్డంకి కాదని, మంచి కథ ఏ భాషలో చెప్పినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.
సినిమాలతో పాటు ఓటీటీ వేదికలో కూడా కొత్త ప్రయోగాలకు సిద్ధమవుతున్నట్లు నందినీ రెడ్డి వెల్లడించారు. త్వరలో ఒక డార్క్ సూపర్ నేచురల్ వెబ్సిరీస్ రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ వెబ్సిరీస్ షూటింగ్ అక్టోబర్లో ప్రారంభం కానుందని, ఇప్పటివరకు చేసిన లైట్ హార్టెడ్ చిత్రాలకు భిన్నంగా ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని వివరించారు.

అలాగే తన తదుపరి ఫీచర్ ఫిల్మ్ 2027 ప్రారంభంలో సెట్స్పైకి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. కొత్త కథలు, కొత్త జానర్లలో ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆమె వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
టాలీవుడ్లో విజయవంతమైన దర్శకురాలిగా గుర్తింపు పొందిన నందినీ రెడ్డి, ఇప్పుడు బాలీవుడ్లో కూడా తన ప్రతిభను చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. హిందీ చిత్రంతో పాటు డార్క్ వెబ్సిరీస్పై ఆమె చేసిన ప్రకటనలతో సినీ అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
click here to read ‘టాక్సిక్’ తర్వాత.. ఇప్పుడు అందరి చూపు ‘స్పిరిట్’పైనే!



