‘మా ఇంటి బంగారం’ వెనుక బిగ్ ట్విస్ట్
రిలీజ్కు ముందు సమంత రివీల్తో పెరిగిన హైప్
‘మా ఇంటి బంగారం’ రిలీజ్కు ముందు సమంత ప్రమోషన్స్లో దూకుడు పెంచింది. ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా కంటెంట్తో సినిమాపై హైప్ పెంచుతున్న సమంత.. తాజాగా ఈ మూవీ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
ఈ సినిమాకు మొదటి ఎంపిక తాను కాదని, మేకర్స్ ముందుగా సాయి పల్లవిని అనుకున్నారని సమంత చెప్పింది. అయితే సాయి పల్లవి డేట్స్ కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ తన దగ్గరకు వచ్చిందని తెలిపింది. స్క్రిప్ట్లో కొన్ని మార్పులు చేసిన తర్వాతే తాను ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు చెప్పింది.
సమంత తన ‘Tralala Moving Pictures’ బ్యానర్పై ఈ సినిమాను నిర్మిస్తుండగా, నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 19న విడుదలకు సిద్ధమవుతున్న ఈ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సమంత చెప్పిన ఈ ఒక్క రివీల్తో ఇప్పుడు సినిమా చుట్టూ కొత్త చర్చ మొదలైంది




