కాక్టెయిల్ 2పై రూమర్స్కు చెక్.. రష్మిక, కృతి ట్రాక్పై క్లారిటీ!
బాలీవుడ్లో కొత్త బజ్
బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్ట్గా రూపొందుతున్న ‘కాక్టెయిల్ 2’ చుట్టూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా రష్మిక మందన్న, కృతి సనన్ పాత్రలపై వస్తున్న ఊహాగానాలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచేశాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంటుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో పెద్ద చర్చ మొదలైంది.
అయితే ఈ ప్రచారాలపై చిత్ర నిర్మాత దినేష్ విజన్ క్లారిటీ ఇచ్చారు. రష్మిక, కృతి మధ్య అలాంటి లవ్ స్టోరీ లేదని ఆయన స్పష్టం చేశారు. సినిమా కథ గురించి సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు నిజం కావని, ప్రేక్షకులు తెరపై చూసే కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని వెల్లడించారు.
నిర్మాత తెలిపిన వివరాల ప్రకారం, ‘కాక్టెయిల్ 2’ కథ ఆధునిక సంబంధాలు, ప్రేమ, ఎమోషన్స్ చుట్టూ తిరుగుతుందట. ఇందులో రెండు వేర్వేరు రొమాంటిక్ ట్రాక్స్ ఉంటాయని, అవి కొత్త తరం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని బోల్డ్గా, ఎమోషనల్గా డిజైన్ చేసినట్లు సమాచారం.
హోమీ అదజానియా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కృతి సనన్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రొమాన్స్, డ్రామా, హ్యూమర్ కలయికతో ఈ చిత్రం యూత్ను టార్గెట్ చేస్తూ తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి, రూమర్స్తోనే ‘కాక్టెయిల్ 2పై బజ్ మరింత పెరిగింది. కానీ అసలు కథ ఏమిటి? రష్మిక, కృతి పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అనే ఆసక్తి మాత్రం ఇంకా అలాగే కొనసాగుతోంది. జూన్ 19న థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.




